రాముడికి పాలాభిషేకం

by  |
రాముడికి పాలాభిషేకం
X

దిశ, సంగారెడ్డి: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కోసం నిర్వహించిన భూమి పూజ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం శ్రీరాముని చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ రాజేశ్వరరావు దేశ్ పాండే, పట్టణ శాఖ అధ్యక్షులు వినోద్ కుమార్, పట్టణ, జిల్లా మోర్చ నాయకులు యశ్వంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, మొరంగంటి విష్ణువర్ధన్ రెడ్డి, పవన్ ముదిరాజ్, రవిశంకర్, మురళీధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.


Next Story

Most Viewed