ప్రజల గుండెల్లో జయశంకర్

by Shyam |
ప్రజల గుండెల్లో జయశంకర్
X

దిశ, వరంగల్: ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ సిద్ధాంత క‌ర్త‌గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం ఆచార్య జయశంకర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలని కొనియాడారు. జయశంకర్ ఆజ‌న్మాంతం బ్ర‌హ్మ‌చారిగా, తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారని తెలిపారు. సార్ ఆశ‌యాల‌నే ఆదేశిక సూత్రాలుగా, సీఎం కేసీఆర్ తెలంగాణ‌ను బంగారు తెలంగాణ‌గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.

Advertisement

Next Story