ఇక రైట్ రైట్….

by  |
ఇక రైట్ రైట్….
X

దిశ వెబ్ డెస్క్: హైద్రాబాద్‌కు బస్సులు నడిపేందుకు వైసీపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కు బస్సులు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ బస్సుల రవాణా అంశాన్ని సీఎం జగన్ వద్ద మంత్రులు పేర్నినానీ, బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. దానిపై సీఎం జగన్ స్పందించారు. బస్సుల రవాణా అంశంలో అవసరాన్ని బట్టి న్యాయసలహా తీసుకోవాలని సూచించారు.

ఇక క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చిస్తూ…బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం సీటుకు సీటుకు మధ్య ఒక సీటు వదిలి పెట్టాలన్నారు. సగం సీట్లలను మాత్రమే ప్రయాణికులతో నింపాలన్నారు. ప్రయాణీకులు మాస్క్ విధిగా ధరించాలన్నారు.


Next Story

Most Viewed