ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు?

by srinivas |
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల బాటలోనే పరీక్షలను రద్దు చేయాలా?.. లేదా? అనే దానిపై జగన్ చర్చిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్లుగానే జగన్ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసే అవకాశాలున్నాయి.

ఇక ఇంటర్, ఇతర పరీక్షలపై కొద్దిరోజుల్లో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇవాళ పదో తరగతి పరీక్ష నిర్వహణపై మాత్రమే నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed