అలర్ట్.. ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

by srinivas |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 94,595 సాంపిల్స్‌ను పరీక్షించగా 3,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,02,923కు పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 29 మంది మృతి చెందగా..మెుత్తం మరణాల సంఖ్య 12,844కి పెరిగాయి. ఇకపోతే గడచిన 24 గంటల్లో 3,692 మంది కరోనా నుంచి కోలుకోగా..మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 18,54,754కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,23,63,078కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed