జేసీ కేసు…ఆ 92 వాహనాలెక్కడ?

by srinivas |
జేసీ కేసు…ఆ 92 వాహనాలెక్కడ?
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని అనంతపురం జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ శివరాంప్రసాద్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసిందని అన్నారు. ఇందులో ఇప్పటి వరకు 62 బస్సులు, లారీలను అనంతపురం జిల్లాలో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక మిగిలిన 92 వాహనాలను ఎక్కడ దాచారన్న సమాచారంపై మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ వాహనాలు తరలించేందుకు సృష్టించిన నకిలీ ఇన్‌వాయిస్‌లు‌, ఫేక్‌ ఇన్సూరెన్స్‌లపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed