- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: ధాన్యం కేంద్రాల ఏర్పాటు, కరోనా కేసులు నమోదుపై ఆర్థిక మంత్రి హరీష్ రావు మెదక్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోతకు ఇబ్బంది లేకుండా కోత యంత్రాలు సిద్ధం చేయాలన్నారు. 350 కోత యంత్రాలు అవసరం ఉంటాయని, అన్నింటిని జిల్లాకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైవర్స్, మెకానిక్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కరోనా నేపథ్యంలో పాత పద్ధతిలో కాకుండా ప్రత్యేకంగా ఈసారి టోకెన్ జారీ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. కనీస ప్రమాణాలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని మంత్రి అధికారులకు చెప్పారు. చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు తమ పంటని కోయగానే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలియజేయాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
Tags: Harish Rao, review, grain purchases, medak