బడిలో పరీక్షలు లేవు

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో :
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలంటూ తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రాంచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 22 నుంచి మే 5 వరకు రాష్ర్టవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలన్నీ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.

Tags: Telangana, Lockdown, Education, chitra ramachandran, school education

Advertisement

Next Story

Most Viewed