ప్రియుడి ఇంటి ఎదుట.. ప్రియురాలు మౌన పోరాటం

by  |
ప్రియుడి ఇంటి ఎదుట.. ప్రియురాలు మౌన పోరాటం
X

దిశ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రియుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని తెలిసి, ప్రియుని ఇంట్లో ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన పల్లికొండ ఉమారాణి, బేస్తవారపేటకు చెందిన ఉదయ్‌లు గత ఆరేండ్లుగా ప్రేమించుకున్నారు. ఉదయ్ గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడని ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా కుటుంబ సభ్యులు చెప్పిన మరో పెళ్లికి సిద్ధపడుతున్నట్టు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఉమారాణి మహిళా సంఘాల ఆధ్వర్యంలో బేస్తవారపేటలోని ఉదయ్ ఇంట్లోకి వెళ్లి మౌన పోరాటానికి దిగింది. ఒకానొక దశలో ఉదయ్ కుటుంబ సభ్యులకు, మహిళా సంఘాల నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రియుడు, ప్రియురాలిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయ్ మంచిర్యాల బస్ డిపో‌లో కండక్టర్ గా పని చేస్తున్నాడు.


Next Story

Most Viewed