మద్యం మత్తులో కూతురిపై అఘాయిత్యం

by  |
మద్యం మత్తులో కూతురిపై అఘాయిత్యం
X

దిశ ఏపీ బ్యూరో: కంచే చేనుమేసినట్లు.. కన్న తండ్రే కుమార్తె పాలిట కీచకుడిగా మారిన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. వింజమూరు పంచాయతీకి చెందిన వ్యక్తి నిన్న తన ద్విచక్రవాహనంపై కుమార్తెను తీసుకుని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో మద్యం సేవించాడు. మార్గమధ్యంలో మద్యం మత్తులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని చెరనుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక విషయాన్ని తల్లికి వివరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed