నిరుద్యోగులకు శుభవార్త..

by  |
నిరుద్యోగులకు శుభవార్త..
X

దిశ, వెబ్‌డెస్క్ : నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్ మహింద్రా ఫౌండేషన్ సిద్ధమైంది. చదువుకుని ఖాళీగా ఉంటున్న వారికోసం ఉచిత ఆన్‌లైన్ తరగతులు నిర్వహించునున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ మేనేజర్‌ మౌలా తెలిపారు. ప్రస్తుత సమాజంలో చాలా మంది ఉద్యోగాలు దొరకగా ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసమే టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌, అప్సా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌, కమ్యూనికేటివ్‌ స్కిల్స్‌, ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ కోర్సుల్లో శిక్షణ అందించడంతోపాటు 100 శాతం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు.

పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్‌, డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన 18 నుంచి 27 ఏళ్ల లోపు యువతీ, యువకులు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు న్యూ భోలక్‌పూర్‌లోని ఎవర్‌గ్రీన్‌ సామాజిక భవనం నందు గల అప్సా‌టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ స్మార్ట్‌ వృత్తి శిక్షణా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 70754 61137, 86398 21605 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలన్నారు.


Next Story

Most Viewed