వేరువేరు ఘటనలో ఇద్దరు యువకుల ఆత్మహత్య

by Disha Web Desk 23 |
వేరువేరు ఘటనలో ఇద్దరు యువకుల ఆత్మహత్య
X

దిశ,బోథ్: బోథ్ పట్టణ కేంద్రం కి చెందిన ఇద్దరు యువకులు వేరే వేరే ఘటనలో మృతి చెందారు. వివరాలకు వెళ్తే బోథ్ పట్టణం సాయి నగర్ కు చెందిన ఆడేపు ప్రవీణ్ (33 సం,,) ఇంట్లో ఎవరూ లేని సమయంలో లో ఉరి వేసుకొని చనిపోయాడు. అలాగే బోథ్ పట్టణం న్యూ కాలనీ కి చెందిన గుమ్ముల జశ్వంత్ (21 సం,,) పురుగుల మందు తాగి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వాంతులు చేసుకోగా కుటుంబ సభ్యులు సివిల్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్ కి బయలు దేరగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడు ప్రవీణ్ ఈ మధ్య ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి వచ్చాడు అప్పులు బాగా చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే గుమ్ముల జశ్వంత్ ఉద్యోగ కోసం కష్టపడుతున్నారు. ఇటీవలే నేవి పరీక్ష రాశారు. ఉద్యోగం రాలేదని పురుగుల మందు తాగి చనిపోయారు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేశామని బోథ్ ఎస్సై రాములు తెలిపారు.



Next Story