పెనుమూరులో తండ్రీకూతురు గల్లంతు

by srinivas |
పెనుమూరులో తండ్రీకూతురు గల్లంతు
X

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా పెనుమూరులో తండ్రీ కూతురు గల్లంతయ్యారు. కొండయ్యగారిపల్లి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ కారులో ఒడ్డారపల్లికి చెందిన ప్రతాప్ కుటుంబం చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని కాపాడారు. కాగా, ప్రతాప్‎తో పాటు కూతురు వినూత గల్లంతైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్ధలికి చేరుకున్న సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed