ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

by  |
ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
X

దిశ, భూపాలపల్లి:
భూపాలపల్లిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓసీ3 ప్రాజెక్టు బాధిత రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొండంపల్లి గ్రామానికి చెందిన మా భూములు ఓసీపీ3 ప్రాజెక్టు కింద కోల్పోతుండగా కొంత మంది దళారులు నష్టపరిహారం కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన కరువైందన్నారు. రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఏఐఎఫ్‌బీ నాయకులు గండ్ర సత్య నారాయణ రావు మాట్లాడుతూ నష్ట పరిహారం చెల్లించకుండా అధికార పార్టీ నాయకులు తప్పుడు పత్రాలతో డబ్బులు కాజేశారన్నారు. వారిని అరెస్టు చేసి, డబ్బులు వసూలు చేసి అసలైన భూనిర్వాసితులకు నష్ట పరిహారం తిరిగి చెల్లించాలన్నారు.


Next Story

Most Viewed