- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిరసనలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం: ఆంటోనీ బ్లింకెన్
దిశ, నేషనల్ బ్యూరో: చైనా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ఈస్ట్లో జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొంతమంది చేపడుతున్న నిరసనలు ప్రజాస్వామ్యంలో ఒక భాగమని అన్నారు. ఇజ్రాయిల్-హామాస్ యుద్ధాన్ని ఆపాలని విశ్వవిద్యాలయాల్లో కొంతమంది నిరసనలు చేపట్టగా నిరసనకారులను చెదరగొట్టడానికి కొన్నిసార్లు రసాయనాలు, టేజర్లను ఉపయోగిస్తారు. ఈ నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఇటువంటి నిరసనలు "మన ప్రజాస్వామ్యం లక్షణం" అని చైనాలో ఒక సమావేశంలో బ్లింకెన్ అన్నారు.
మా పౌరులు తమ అభిప్రాయాలు, వారి ఆందోళనలను, వారి కోపాన్ని ఏ సమయంలోనైనా తెలియజేస్తారు, ఇది దేశ బలాన్ని ప్రతిబింబిస్తుందని నేను భావిస్తున్నాను అని బ్లింకెన్ చైనాలో చెప్పారు. ఇజ్రాయిల్-హామాస్ యుద్ధం గురించి మాట్లాడుతూ, ఇంతకు ముందు చెప్పినట్లుగా హామాస్ తన ఆయుధాలను విడిచి, పౌరుల వెనుక దాక్కోవడం మానేసి, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టినట్లయితే అసలు ఈ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది, కానీ హామాస్ అలా చేయకూడదని నిర్ణయించుకుందని అన్నారు.