ఢిల్లీలో ప్రతి కరోనా మరణాన్ని రిపోర్ట్ చేయాలి: అమిత్ షా

by Shamantha N |
ఢిల్లీలో ప్రతి కరోనా మరణాన్ని రిపోర్ట్ చేయాలి: అమిత్ షా
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకునే ప్రతి కరోనా మరణాన్ని కేంద్రానికి రిపోర్ట్ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచించారు. కరోనా కట్టడికి కంటైన్‌మెంట్ స్ట్రాటజీనే పూర్తిగా మార్చేయాలని, వైద్య సేవలను బలోపేతం చేయాలని తెలిపారు. పేషెంట్‌ల కాంటాక్ట్ ట్రేసింగ్‌లను వేగంగా పసిగట్టాలని అన్నారు. కరోనా మహమ్మారిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశాన్ని నిర్వహించగా హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌ల మరణాలపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు ఢిల్లీ సర్కారు తెలిపింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఐసీఎంఆర్, ఎయిమ్స్ వైద్యులు హాజరయ్యారు.

Next Story

Most Viewed