భారీగా డ్రగ్స్ పట్టివేత..

by  |
భారీగా డ్రగ్స్ పట్టివేత..
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బుధవారం బెల్జీయం, నెదర్లాండ్ దేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1.65 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్ అధికారులు పట్టుకున్నారు. కరోనా సమయంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులను తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం వందేభారత్ మిషన్‌ కింద విమానాలను నడుపుతోన్న విషయం తెలిసిందే..

అదే అదునుగా భావించిన కొందరు దుండగులు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నారు. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈరోజు వారిని అదుపులోకి తీసుకుని.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story

Most Viewed