దిశ ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ అధికారులు

by Shyam |
దిశ ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ అధికారులు
X

దిశ,మేడ్చల్ : ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అనే ‘దిశ’ పత్రికలో బుధవారం వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండలంలోని బండ మాదారం గ్రామంలోని పెద్ద చెరువు లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ పవన్ చంద్ మాట్లాడుతూ గ్రామాల్లోని ఎక్కడైనా విద్యుత్ తీగలు వేలాడుతు కనపడితే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. తమ గ్రామంలోని విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించేందుకు రైతులు దిశ పత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed