‘ఇది రైతులను దగా చేయడం కాదా జగన్’

by  |
‘ఇది రైతులను దగా చేయడం కాదా జగన్’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయంలో ఇచ్చిన పథకాల్లో కోతలు పెడుతున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల ముందు రైతులకు వడ్డీలేని పంట రుణాల ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం తీసుసుకున్న 76 వేల కోట్ల పంట రుణాలకు రైతుల ఖాతాల్లో ఎంత వడ్డీ జమచేశారని దేవినేని ప్రశ్నించారు. టీడీపీ హాయంలో మూడు లక్షల వరకు ఇచ్చిన సున్నా వడ్డీని లక్షలోపు పంటరుణానికే పరిమితం చేశారని విమర్శించారు. ఇది రైతులను దగా చేయడం కాదా జగన్ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed