ఇది బీజేపీ గూండాల పనే : చింతా మోహన్​

by srinivas |
chinta mohan
X

దిశ, ఏపీబ్యూరో : రామతీర్థం ఘటనపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతామోహన్ ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలో రాముడి తల కోసింది బీజేపీ గూండాలేనన్నారు. ఈ ఘటనతో ఇతర పార్టీలకు సంబంధం లేదన్నారు. తిరుమల బాలాజీ నగర్​లో శిలువ గుర్తులేసి తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినట్లు మోహన్​వెల్లడించారు. ఆరెస్సెస్, బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనే దమ్ము వైసీపీ, టీడీపీకి లేదని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, వెంకటగిరి లోనూ బీజేపీ స్కెచ్ వేస్తోందన్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ కులం పేరుతో సభలు పెడుతోందని విమర్శించారు. ఓబీసీ లకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని చింతామోహన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed