వరదల్లో కలిసిపోయిన పంట పొలాలు

by Aamani |   ( Updated:2021-07-21 22:35:54.0  )
వరదల్లో కలిసిపోయిన పంట పొలాలు
X

దిశ ఖానాపూర్: నిర్మల్ జిల్లాలో గత రెండురోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పెంబి మండలంలోని ఇటిక్యాల, పెంబి, లోతుర్ తండా, తాటిగుడా గ్రామంలో పంట భూములు పూర్తిగా మునిగిపోయాయి. ఇటిక్యాల గ్రామంలోని మద్దెల గంగన్న, మద్దెల రాజనర్సు రైతులకు చెందిన 4 ఎకరాల పసుపు పంట పూర్తిగా మునిగి పోయి చెరువుగా మారింది. అంతేకాకుండా, మొత్తంగా 20 ఎకరాల పత్తి, పసుపు పంట భూములు మునిగి జలాశయం‌గా మారడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed