Road Accident: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం.. స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థిని దుర్మరణం

by Shiva |
Road Accident: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం.. స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థిని దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థిని దుర్మరణం పాలైన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారి పాలెంలో శ్రీవాణి పబ్లిక్ స్కూల్‌ చెందిన బస్సు విద్యార్థులను పిక్‌అప్ చేసుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న రాయి పైకి బస్సు ఎక్కడంతో అదుపుతప్పి బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డోర్ పక్కనే కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోగా బాలిక‌ బస్సు కింది ఇరుక్కుపోయంది. జేసీబీ సాయంతో బస్సును పక్కకు తొలగించగా అప్పటికే విద్యార్థిని భవిష్య ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అప్పటి వరకు ఇంట్లో నవ్వుతూ సందడి చేసిన కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు.

Advertisement

Next Story

Most Viewed