Man died: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. కాలువలో జారిపడి ఒకరి మృతి

by Shiva |
Man died: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. కాలువలో జారిపడి ఒకరి మృతి
X

దిశ, బాల్కొండ: కాలువలో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని మెండోరా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం కాకతీయ కాలువ వద్దకు వెళ్లిన లక్ష్మణ్ (55) ప్రమాదవశాత్తు అందులో జారీ పడిపోయాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి కాలువ వద్దకు వెళ్లి లక్ష్మణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో బుధవారం తెల్లవారుజామున మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు భోజరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరిలించారు.

Advertisement

Next Story

Most Viewed