ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట

by Mahesh |
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 23 మందికి పైగా మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ లో చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక నివేదిక ప్రకారం, తొక్కిసలాటలో గాయపడిన 15 మంది మహిళలు, పిల్లలను చికిత్స కోసం ఉటాహ్ మెడికల్ కాలేజీలో చేర్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. తొక్కిసలాట సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed