- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
హర్యానాలో దారుణం.. భర్త, పిల్లల ముందే ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్
చండీగఢ్ : హర్యానాలోని పానీపట్ జిల్లా మట్లాడలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 1 గంటలకు మట్లాడ గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న పలు ఇళ్లలో దొంగలు పడ్డారు. ఓ ఇంటిలోకి చొరబడ్డ నలుగురు దొంగలు.. తల్వార్లు, తుపాకులతో బెదిరించి అక్కడున్న మూడు కుటుంబాల సభ్యులందరినీ తాళ్లతో కట్టేశారు. 24, 25, 35 ఏళ్ల వయసున్న ముగ్గురు మహిళలపై ఆ దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం రూ.13వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని పరారయ్యారు. భర్తలు, పిల్లల ఎదుటే తమపై గ్యాంగ్ రేప్ జరిగిందని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాదాపు 3 గంటల పాటు దొంగలు తమ ఇంట్లోనే ఉన్నారని.. అత్యాచారం చేసే సమయంలో అరుపులు బయటికి వినిపిస్తే తుపాకీతో కాల్చి చంపుతామని వార్నింగ్ ఇచ్చారని కంప్లయింట్ లో పేర్కొన్నారు. ఇక ఈ దుండగులు పారిపోయే క్రమంలో.. మరో ఇంట్లోకి చొరబడి ఓ మహిళపై దాడి చేసి రూ.5వేలు దోచుకున్నారు. దొంగలు దాడిచేసిన అనంతరం ఆ మహిళ చికిత్సపొందుతూ చనిపోయింది. నెల రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ ఇళ్ల వద్దకు వచ్చి.. వెంటనే స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఆనాడు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులకు.. అఘాయిత్యాలకు తెగబడిన నలుగురు దుండగులతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.