ఆన్ లైన్ ప్రియుడి కోసం 5000 కి మీ ప్రయాణం.. చివరకు ఆమెను ముక్కలు చేసి అవయవాలు అమ్ముకున్న వ్యక్తి..

by Mahesh |   ( Updated:2022-11-26 08:51:47.0  )
ఆన్ లైన్ ప్రియుడి కోసం 5000 కి మీ ప్రయాణం.. చివరకు ఆమెను ముక్కలు చేసి అవయవాలు అమ్ముకున్న వ్యక్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళ తన డేటింగ్ యాప్ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి 5000 కి మీ ప్రయాణించి వెళ్లింది. అయితే ఆమె నవంబర్ 9న హువాచో బీచ్ లో శవమై కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెక్సికోకు చెందిన 51 ఏళ్ల బ్లాంకా అరెల్లానో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తాను కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌లో తనకు పరిచయం ఉన్న జువాన్ పాబ్లో జీసస్ విల్లాఫుర్టే (37)ని కలవడానికి పెరూలోని లిమాకు వెళ్తున్నానని చెప్పింది. ఆ వ్యక్తి తీరప్రాంత నగరమైన హువా చోలో నివసిస్తున్నారు. నవంబర్ 7న, కుటుంబానికి అరెల్లానోతో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం అమె అతన్ని కలుసుకుంది.

ఆ తర్వాత ఏమైందో ఏమో ఎవ్వరికి తెలియలేదు. 9న హువాచో బీచ్ లో ఆమె శరీరం ముక్కలుగా చేసి.. ఉండటం ఓ మత్స్యకారుడు కనుగొన్నాడు. అయితే ఆమెను ఆమె ప్రియుడు అవయవాలు అమ్ముకోవడానికి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సముద్రపు ఒడ్డున దొరికిన మహిళ శరీరంలో ముఖ్యమైన అవయవాలు లేవని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె కలిసిన వ్యక్తి ఆమెను ఆవయవాలకోసం చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటె పేరులో ఈ రకమైన బ్లాక్ దందా ఎక్కువగా ఉంటుంది.

Also Read......

మూడు నెలల చిన్నారిని బండకేసి కొట్టిన తండ్రి

Advertisement

Next Story

Most Viewed