ఎదురెదురుగా రెండు బైక్​లు ఢీ...ఒకరు మృతి

by Sridhar Babu |
ఎదురెదురుగా రెండు బైక్​లు ఢీ...ఒకరు మృతి
X

దిశ, మిడ్జిల్ : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృత్యువాత పడగా ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం మిడ్జిల్ మండలం రాణి పేట, కొత్తపల్లి మధ్య 167 వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, భాను ప్రకాష్ మిడ్జిల్ మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై బయలుదేరగా కల్వకుర్తి నుండి నరసింహులు (33) తన బైక్​పై జడ్చర్లకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో రాణిపేట, కొత్తపల్లి మధ్య జాతీయ రహదారిపై అదుపుతప్పి ఎదురెదురుగా వారి బైక్​లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో నరసింహులు పరిస్థితి విషమించి మృతి చెందాడు. నరసింహులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు కాగా జడ్చర్లలో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనపై ఇరువురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story