పండుగ రోజు కుటుంబంలో విషాదం

by Sridhar Babu |
పండుగ రోజు కుటుంబంలో విషాదం
X

దిశ, నెక్కొండ : పండుగ రోజు ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వలలో చిక్కుకొని వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామానికి చెందిన నీరటి రమేష్(39 తమ గ్రామంలో ఉన్న ఊరుకుంట్ల చెరువులో ఆదివారం తెల్లవారుజామున చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుని భార్య అమృత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కూతురు మానస, కుమారుడు మహేష్ ఉన్నారు. పండుగ రోజు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed