అప్పటి వరకు ఉన్న బంగారం అంతలోనే మాయం

by Sridhar Babu |
అప్పటి వరకు ఉన్న బంగారం అంతలోనే మాయం
X

దిశ, నాగర్ కర్నూల్ : అప్పటి వరకు ఉన్న బంగారం అంతలోనే మాయం అయింది. ఆర్టీసీ బస్సులో 9 తులాల బంగారం కనిపించకుండా పోయింది. ఈ ఘటన బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన మహేష్ అతని భార్య సువర్ణ పిల్లలతో కలిసి నాగర్ కర్నూల్ బస్టాండ్ లో కల్వకుర్తి బస్సు ఎక్కారు. అంతకు ముందు పర్సులో 9 తులాల బంగారు ఆభరణం భద్రపరిచారు. కొల్లాపూర్ చౌరస్తా రాగానే కుమారుడికి టికెట్ తీసుకునేందుకు పర్సు తీయగా అందులోని బంగారం కనిపించలేదు. దీంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. వెంటనే తోటి ప్రయాణికులకు తెలపడంతో బస్సు ఆపి సోదాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. వెంటనే నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed