- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP News:అత్త చెవిని అమాంతం కొరికేసిన కోడలు.. అతికించలేమన్న వైద్యులు.. ఆ తర్వాత ఏమైందంటే?
దిశ,వెబ్డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో కలహాలు సహజమే. ఇక కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామన్ అయిపోయింది. కానీ ఆ గొడవలు శ్రుతి మించితేనే ప్రమాదం. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు తన అత్త చెవిని కొరికేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. ఓ కోడలు అత్త చెవిని అతి దారుణంగా కొరికేసింది. జిల్లాలోని తుళ్లూరులో ఉంటున్న కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో కోడలు పావనికి అత్త నాగమణి(55)కి గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవతో ప్రారంభమై అది పెద్దగా రాజుకుంది . ఈ గొడవలో క్షణికావేశానికి గురైన కోడలు అత్త చెవిని అతి దారుణంగా కోరికేయడంతో ఆ భాగం ఊడిపోయింది. ఆ తర్వాత తెగిపోయిన చెవితో అత్త నాగమణిని స్థానికులు తుళ్లూరు పీహెచ్సీకి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆలస్యం కావడంతో తెగిన చెవి అత్తుకోవడం కష్టమని డాక్టర్లు చెప్పినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఘటన పై బాధితుల ఫిర్యాదు మేరకు చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.