రూ. 2 లక్షల విలువైన గంజాయి పట్టివేత..

by Aamani |
రూ. 2 లక్షల విలువైన గంజాయి పట్టివేత..
X

దిశ, వైరా : వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా ముగ్గురు యువకులు సంచరిస్తున్నారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువైన 8.5 కేజీల గంజాయిని సోమవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పల్లిపాడు గ్రామ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు ఆర్టీసీ బస్సులను తనిఖీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తమ వద్ద ఉన్న బ్యాగుతో పల్లిపాడు గ్రామ సమీపంలో దిగారు. ఆ సమయంలో రోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ముగ్గురు యువకులను ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేశారు.

ఆ యువకుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేసి 8.50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వెంటనే సీఐ మమత ఎస్సై సాయిరాం గంజాయి తరలిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ ముగ్గురు యువకులు నెల్లూరుకు చెందిన చంద్రబాబు, అప్రోజ్ , అజిబ్ లుగా గుర్తించారు. వీరు బీటెక్ చదువుతున్న విద్యార్థులను, నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ మమత ఎస్సై సాయిరాం తెలిపారు. గంజాయిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed