Businessman : రాజకీయ, వ్యాపారవేత్త దిగంబర్ మాశెట్టివార్ మృతి...

by Sumithra |   ( Updated:2024-10-26 07:33:54.0  )
Businessman : రాజకీయ, వ్యాపారవేత్త దిగంబర్ మాశెట్టివార్ మృతి...
X

దిశ, భైంసా : రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా పేరున్న మాశెట్టివార్ దిగంబర్ ( Mashettiwar Digambar ) శనివారం కన్నుమూశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ( Congress ) దాదాపు దశాబ్ద కాలానికి పైగా సేవలందించారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై పట్టణ అభివృద్ధికి కృషి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ ( Saraswati Shishu Mandir Schools ) పాఠశాలల స్థాపనకు, అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ, పట్టణ పూలేనగర్ లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు కోట్లాది రూపాయల విలువైన భూమిని ఉచితంగా అందించారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed