మంచం పట్టెతో దాడి.. ఒకరి మృతి

by Jakkula Mamatha |
మంచం పట్టెతో దాడి.. ఒకరి మృతి
X

దిశ, ఇనుగుర్తి(నెల్లికుదురు): మండలం లోని చిన్న ముప్పారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు(శుక్రవారం) ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి మల్లం యాకయ్య (60) సంవత్సరాలు రోడ్డుపై వెళ్తుండగా మల్లం రాజు అనే వ్యక్తి మంచం పట్టెతో దాడి చేయగా యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు . ఈ విషయం తెలుసుకున్న సీఐ జగదీష్ నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య సోమక్క, కుమారుడు రమేష్, కూతురు నాగలక్ష్మి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed