- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ మృతి..
by Vinod kumar |
X
దిశ, చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రం చిలుకూరులోని జేజే నగర్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కొత్తపాడుకు చెందిన దాసరి నాగయ్య(35) కోదాడలోని కళాశాలలో అధ్యాపకుడు. అతని భార్య హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం. వీరిద్దరూ హుజూర్ నగర్లో నివాసం ఉంటున్నారు. నాగయ్య గురువారం కోదాడ కళాశాలలో విధులు ముగించుకుని రాత్రి హుజూర్ నగర్ వెళుతుండగా చిలుకూరులో ఇతని బైక్, ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొన్నాయి. తల, చేతులకు బలమైన గాయాలు కావడంతో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య గర్భవతిగా ఉండడం విషాదకరం. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story