రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ మృతి..

by Vinod kumar |
రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ మృతి..
X

దిశ, చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రం చిలుకూరులోని జేజే నగర్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కొత్తపాడుకు చెందిన దాసరి నాగయ్య(35) కోదాడలోని కళాశాలలో అధ్యాపకుడు. అతని భార్య హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం. వీరిద్దరూ హుజూర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. నాగయ్య గురువారం కోదాడ కళాశాలలో విధులు ముగించుకుని రాత్రి హుజూర్ నగర్ వెళుతుండగా చిలుకూరులో ఇతని బైక్, ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొన్నాయి. తల, చేతులకు బలమైన గాయాలు కావడంతో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య గర్భవతిగా ఉండడం విషాదకరం. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed