- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
చెరువులో పడి భార్యాభర్తలు మృతి
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోతిరెడ్డిపల్లికి చెందిన కొండా రాంబాబు చెరువులోకి స్నానానికి దిగిన గేదెలను తీసుకు వచ్చేందుకు వెళ్ళి నీటి ఊబిలో కూరుకుపోయాడు. కేకలు పెడుతున్న భర్తను రక్షించేందుకు చెరువు నీటిలోకి దూకిన భార్య ప్రశాంతి సహా ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతులు కొండా రాంబాబు, ప్రశాంతిలుగా గుర్తించారు. భార్యాభర్తల మృతి ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నూజివీడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story