- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఘోరం.. విద్యుత్ షాక్ గురై వ్యక్తి మృతి..
by Kavitha |
X
దిశ, వైరా : వైరా ఐఎంఎల్ డిపోలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పని చేస్తున్న చెరుకుమల్ల సీతయ్య(42) శనివారం ఉదయం 6 గంటలకు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర రోడ్లో ఉన్న సీతయ్య స్వగృహం ప్రక్కన ఓ దుకాణానికి చెందిన ఐరన్ బోర్డుకు విద్యుత్ సరఫరా అవుతుండటంతో అది తెలియక ఆ బోర్డును తాకిన సీతయ్య విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో స్థానికులు హుటాహుటీన క్షతగాత్రున్ని హాస్పిటల్కు తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేదు.. ఎందుకంటే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామానికి చెందిన సీతయ్య గత కొన్ని ఏళ్ల క్రితం వైరాలో స్థిరపడ్డారు.. అతనికి భార్య కొడుకు ఉన్నారు. కుటుంబ పెద్ద హఠాన్మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story