Mumbai: ముంబైలో హైఅలెర్ట్.. ఉగ్రముప్పు ఉందని హెచ్చరికలు

by Shamantha N |
Mumbai: ముంబైలో హైఅలెర్ట్.. ఉగ్రముప్పు ఉందని హెచ్చరికలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై(Mumbai)కి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. వివిధ నగరాలకు చెందిన డీసీపీలు (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పోలీసుల మోహరింపు

నగరంలోని ఆలయాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వర్గాలు సూచించాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే ముందుజాగ్రత్త చర్యగా తెలియజేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ముంబైలో ప్రతి ఏడాది దుర్గాపూజ, దీపావళి పండగలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలోనే ఉగ్రముప్పు (Terror Threats) పొంచిఉన్నట్లు హెచ్చరికలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో హెచ్చరికలు రావడంతో అధికారులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed