తాటి చెట్టు ఎక్కగానే గుండెపోటు...కిందపడి గీత కార్మికుడు దుర్మరణం

by Sridhar Babu |
తాటి చెట్టు ఎక్కగానే గుండెపోటు...కిందపడి గీత కార్మికుడు దుర్మరణం
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గౌడ సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి బాబురావు గౌడ్ (40) తాటి చెట్టు పైనుండి పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటు వచ్చింది. దాంతో చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. గౌడ సంఘం అధ్యక్షుడిగా చురుకుగా వ్యవహరించే బాబురావు గౌడ్ ఆకస్మిక మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed