- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
ప్రేమ పేరుతో వేధింపులు.. విలేజ్ క్లినిక్ ఉద్యోగినిపై దాడి
దిశ: కొత్తపేట: ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామ సచివాలయం-2 లోనున్న విలేజ్ క్లినిక్ సీహెచ్ఓగా పని చేస్తున్న జి.యమునపై దాడి జరిగింది. ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకో అంటూ ఆలమూరు గ్రామానికి చెందిన తాళ్ళ గోయల్ సుఖిరాజులు గత కొన్ని రోజుల నుంచి వెంట పడి లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులపై ఆందోళన చెందిన ఆమె నా జోలికి రావద్దు అంటూ వేడుకుంది. ప్రాధేయ పడింది.
తన ప్రేమను నిరాకరించింది అని కక్ష పెంచుకున్న సుఖీరాజులు ఈనెల 19వ తేదీ రాత్రి ఆలమూరులోని బాధితురాలు యమున ఇంటికి వచ్చి తీవ్రంగా కొట్టి దారుణంగా గాయ పర్చాడు. ప్రస్తుతం నిందితుడు ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. దీంతో బాధితురాలు యమున పిర్యాదు మేరకు దిశ చట్టం క్రింద ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలు యమునకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజమహేంద్రవరం ఉమెన్ కేర్ హోం కు తరలించారు. భాధితురాలు యమునకు ముక్కు, దవడకు తీవ్ర గాయాలు కావడంతో సరిగ్గా మాట్లాడ లేక పోతుంది. కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి, ఐసీడీఎస్ పీడి జి. సత్య వేణి, సిడీపీఓ అధికారి గజలక్ష్మి, సబ్ ఇన్స్స్పెక్టర్ ఎస్.శివ ప్రసాద్ తదితరులు బాధితురాలు నివాసానికి వచ్చి ప్రాథమిక విచారణ జరిపారు. ఘటనకు కారకుడైన సుఖిరాజులు కోసం స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎస్ఐ శివ ప్రసాద్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- ap