Tirumala Samacharam: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం!

by Shiva |
Tirumala Samacharam: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం!
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ఆదివారం శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు. వారాంతపు సెలవులు ముగియడంతో టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) కేవలం గంట సమయం పడుతోంది. అదేవిధంగా సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex) ఖాళీగా దర్శనమిస్తోంది. ఆదివారం స్వామి వారిని 82,436 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 25,437 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivaari Hundi) ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed