- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పుణెలో దారుణాలు.. యువతిపై సామూహిక అత్యాచారం.. మరో ఇద్దరు చిన్నారులపై..
దిశ, వెబ్ డెస్క్: దేశంలో ప్రతిరోజూ మహిళలు, ఆడపిల్లలపై మనుషుల రూపంలో ఉన్న మృగాళ్లు విరుచుకుపడుతున్నారు. వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలు చూసి.. ఆడపిల్లల్ని బయటకు పంపాలంటేనే జంకుతున్నారు తల్లిదండ్రులు. జనగామలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. పుణెలో మరో యువతిపై జరిగిన దారుణం వెలుగుచూసింది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుణెకు చెందిన యువతి గత అర్థరాత్రి తన ఫ్రెండ్ తో కలిసి బోప్ దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది. వారిద్దరినీ గమనించిన ముగ్గురు యువకులు.. నిర్మానుష్య ప్రాంతంలో యువకుడిని కొట్టి.. యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ముగ్గురు నిందితులు పరారయ్యారు.
బాధితులు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. వారి కోసం 10 స్పెషల్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పుణె పోలీసులు వెల్లడించారు. పుణెలోనే మరో ప్రాంతంలో వ్యాన్ డ్రైవర్ మైనర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాలికలు స్కూల్ కు వెళ్లి తిరిగివస్తుండగా.. డ్రైవర్ సంజయ్ వారిపై లైంగికదాడి చేశాడు. ఇంటికి వెళ్లిన బాలికలు విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.