విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి

by Aamani |
విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
X

దిశ, వరంగల్ : బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 15వ తేదీన ఓ అమ్మాయిని నమ్మించి ముగ్గురు వ్యక్తులు కారులో నగరంలోని ఓ హోటల్ లోని ఓయో రూం కు తీసుకెళ్లి ఆ అమ్మాయికి బీర్లు తాగించి అమ్మాయిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేశారనే విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మంగళవారం ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ అమ్మాయి బొల్లికుంట వాగ్దేవిలో బీఫార్మా చేస్తూ కాలేజ్ సమీపంలోని అభిరుచి హాస్టల్ లో ఉంటున్నట్లు, అదే కాలేజీలో భూపాలపల్లికి చెందిన ఇద్దరు అబ్బాయిలు బీటెక్ చదువుతున్నట్లు తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఓ నిందితుడు ఉన్నట్లు మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed