- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
షాక్ కొట్టిన జంతువును కాపాడబోయి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగుడి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. నిన్న(శుక్రవారం) సాయంత్రం ఇంటి బయట నీటిలో పడి ఉన్న కరెంటు వైర్ ఆవుకు తగలడంతో మిథున్(32) దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అతనికి షాక్ తగలడంతో తండ్రి పరేష్(60), దీపాలి తల్లి(55) కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిద్దరూ కూడా కరెంట్ షాక్కు బలయ్యారు. ఇలా ఆ ముగ్గురూ కూడా షాక్తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మనవడు సుమన్(2) సైతం ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story