బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..

by Vinod kumar |
బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ, బెల్లంపల్లి: ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో కారు, బైకు ఎదురు ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. బైకుపై వెళ్తున్న భీమిని మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన జాడి రాజ్ కుమార్(35) అక్కడికక్కడే మృతి చెందగా.. రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన బట్టి మోహన్ తీవ్రంగా గాయపడ్డారు.


దీంతో గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలకు తరలించారు. ఈ మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed