Brutal murder: వీఆర్ఏ దారుణ హత్య.. ఏకంగా మంచం కింద డిటోనేటర్లు పెట్టి..

by Shiva |
Brutal murder: వీఆర్ఏ దారుణ హత్య.. ఏకంగా మంచం కింద డిటోనేటర్లు పెట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: వీఆర్ఏ దారుణ హత్యకు గురైన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa District) వేముల మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నరసింహ, సుబ్బలక్ష్మమ్మ భార్యాభర్తలు. అయితే, నరసింహ వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి భార్య సుబ్బలక్ష్మమ్మకు బాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న సుబ్బలక్ష్మమ్మ భర్త నరసింహ, బాబుకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కక్ష పెంచుకున్న బాబు, నరసింహను ఎలాగైనా అంతమొదించాలని పక్కా ప్లాన్ వేశాడు.

ఈ మేరకు ఆదివారం రాత్రి నరసింహ ఇంట్లో పడుకునే మంచం కింద డిటోనేటర్ల (Detonators)ను అమర్చాడు. అతడు నిద్రలోకి జారుకోగానే బాబు వాటిని పేల్చడంతో.. ఆ పేలుడు ధాటికి నరసింహ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. భార్య సుబ్బలక్ష్మమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన సుబ్బలక్ష్మమ్మను చికిత్స నిమిత్తం వేంలపల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed