ఎల్ఎండీ జలాశయంలో యువకుడి మృతదేహం

by Sridhar Babu |
ఎల్ఎండీ జలాశయంలో యువకుడి మృతదేహం
X

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ జలాశయంలో స్థానికులు ఆదివారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్ఎండీ జలాశయంలో ఓ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని శవాన్ని బయటకు తీయించగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ గా గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు జలాశయంలో పడిపోయాడా..? అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story