- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Bihar: 'కనుగుడ్లు పీకేశారు.. నాలుకను కోసేశారు'.. మహిళపై ఐదుగురు దుండగుల క్రూరత్వం
పాట్నా: బీహార్లోని ఖగారియా ప్రాంతంలో 45 ఏళ్ల మహిళను అతి క్రూరంగా చంపేశారు. ఆమె కనుగుడ్లు పీకేశారు.. నాలుకను కోసేశారు.. ఆమె ప్రైవేట్ పార్ట్లను ఛిద్రం చేశారు. దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సులేఖా దేవి శనివారం సాయంత్రం మెహందీపూర్ గ్రామంలో ఒంటరిగా తన పొలంలో పని చేసుకుంటోంది. ద్విచక్ర వాహనాలపై వచ్చిన మహేంద్ర సింగ్, రులో సింగ్, రాజ్దేవ్ సింగ్, ఫులుంగి సింగ్, శ్యామ్కుమార్ సింగ్ అనే ఐదుగురు దుండగులు ఆమెపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు.
అంతటితో ఆగని దుండగులు పదునైన ఆయుధంతో ఆమె కనుగుడ్లు పీకేశారు. నాలుకను చీల్చారు. ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. చిత్రహింసలను తట్టుకోలేకపోయిన సులేఖా దేవి అక్కడికక్కడే మృతి చెందింది. ఐదుగురిపై పోలీసులు సెక్షన్ 302 ప్రకారం హత్య, తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఆస్తి గొడవలు.. భర్త, బావ హత్య..
సులేఖా దేవి పొరుగున ఉండే ఐదుగురు దుండగులకు ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వాళ్లపై బాధితురాలు కేసు పెట్టింది. ఈ వివాదం వల్లే తొమ్మిదేళ్ల క్రితం బాధితురాలి భర్త, బావ హత్యకు గురయ్యారు. వారిని చంపిన హంతకులు బెయిల్పై స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని పోలీసులు చెప్పారు. హత్య తీరును చూస్తే బాధితురాలిపై నిందితులకు చాలా కాలంగా ద్వేషం ఉన్నట్లు తెలుస్తోందని పోలీస్ ఇన్స్పెక్టర్ అమలేష్ కుమార్ తెలిపారు.