గద్వాల జిల్లాలో దారుణం.. 70 కి పైగా గొర్రెపిల్లల గొంతు కోసి చంపిన దుండగులు

by Rajesh |   ( Updated:2022-12-13 05:23:20.0  )
గద్వాల జిల్లాలో దారుణం.. 70 కి పైగా గొర్రెపిల్లల గొంతు కోసి చంపిన దుండగులు
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్/వడ్డేపల్లి: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గొర్రె కాపరులు చిన్న మస్తాన్, నల్లన్న, కేశన్న, ఆంజనేయులు తదితరులు గొర్రె కాపరులుగా జీవనం సాగిస్తున్నారు. సోమవారం జూలకల్లు గ్రామ శివారులోని ఆర్డీఎస్ కెనాల్ శివాలయం దగ్గర గొర్రె పిల్లలను టెంట్‌లో ఉంచి మిగతా పెద్ద గొర్రెలను మేతకు తీసుకువెళ్లారు. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అక్కడికి చేరుకొని 70 గొర్రె పిల్లల గొంతులు కత్తితో కోయడంతోపాటు, పలుచోట్ల పొడిచారు. రాత్రి సమయానికి తిరిగి గొర్రెలను తీసుకువచ్చిన కాపరులు జరిగిన సంఘటనను చూసి బోరున విలపించారు. అదే రాత్రి పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం గ్రామస్తులంతా పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన దారుణానికి కారకులైన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read More....

స్కూల్లో క్షుద్రపూజల కలకలం.. సీసీ ఫుటేజ్ మాయం..?

Advertisement

Next Story

Most Viewed