విద్యుదాఘాతంతో యువకుడు మృతి

by Sridhar Babu |
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
X

దిశ, మద్దిరాల : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన భూతం కృష్ణ (25) తన పొలానికి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా మోటార్ విద్యుత్తు వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed