నీటి కోసం వెళ్లి బావిలో పడి మహిళ మృతి..

by Kalyani |
నీటి కోసం వెళ్లి బావిలో పడి  మహిళ మృతి..
X

దిశ, బెజ్జూర్: ఓ మహిళ నీటి కోసం వెళ్లి బావిలో పడి మృతి చెందిన సంఘటన బెజ్జూర్ మండలంలోని బొగుడ గూడ లో సోమవారం చోటు చేసుకుంది. బెజ్జూర్ ఎస్సై మోహన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం బొగుడ గూడ గ్రామానికి చెందిన అల్లూరి లక్ష్మి (45) అనే మహిళ భర్త అల్లూరి లింగయ్య తో కలిసి పత్తి చేనుకు వెళ్లింది. వ్యవసాయ బావిలో నీటిని తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై మోహన్ నాయక్ తెలిపారు. మృతురాలి భర్త లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ నాయక్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed